వేతన సంఘం అమలు చేయాలి

వేతన సంఘం అమలు చేయాలి

బెల్లంపల్లి, వెలుగు: ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే సీఅండ్ డబ్ల్యూ డిపో షెడ్, లోకో పైలట్ క్రూ లాబీ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ ఎస్.నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికులపై నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. 

రైల్వే కార్మికుల కోసం వెంటనే 8వ వేతన సంఘాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే లోకో పైలట్లకు కిలోమీటరుకు 25 శాతం అలవెన్స్ చెల్లించాలని, అందులో 70 శాతం ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. విలువలతో కూడిన వేతన సంఘాన్ని ప్రకటించి, 2026 జనవరి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బ్రాంచ్ సెక్రటరీ జి.సాంబశివుడు, ట్రెజరర్ శోకిన్ మీనా, నాయకులు నిరాజ్ అగర్వాల్, కె.శంకరయ్య, పెద్ద సంఖ్యలో యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు.