పోలీస్​స్టేషన్లకు ​వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి : ఎస్పీ మహేందర్

 పోలీస్​స్టేషన్లకు ​వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి : ఎస్పీ మహేందర్

మెదక్ టౌన్, వెలుగు: మెదక్​ జిల్లా వ్యాప్తంగా పోలీస్​స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా అడిషనల్​ఎస్పీ మహేందర్​ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నర్సాపూర్ మండలం కాగజ్​ మద్దూరు కు  చెందిన పిల్లుట్ల మహేశ్ గౌడ్ తన పొలం విషయంలో ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. అలాగే పలువురు ఫిర్యాదుదారుల సమస్యలను విని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిఅధికారులకు సూచనలు చేశారు