
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా పొగొట్టుకున్న 150 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు మంగళవారం ఎస్పీ రాజేశ్చంద్ర మీడియాకు తెలిపారు. బాధితులు జిల్లా పోలీసు ఆఫీసుకు వచ్చి ఫోన్లను తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
సెల్ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని, సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చన్నారు. సెల్ఫోన్ల రికవరీకి జిల్లా పోలీస్ ఆఫీసులో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఫోన్లు రికవరీ చేసినందుకు టీమ్స్ను ఎస్పీ అభినందించారు