కామారెడ్డిలో పెండింగ్ కేసులను క్లియర్ చేయాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డిలో పెండింగ్ కేసులను క్లియర్ చేయాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డి టౌన్, వెలుగు : సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్​ చేయాలని  ఎస్పీ రాజేశ్​చంద్ర సూచించారు.  శుక్రవారం జిల్లా ఆఫీస్​లో  నెల వారీ రివ్యూ మీటింగ్ జరిగింది.  స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, క్లియర్​పై చర్చించారు. ఎస్పీ మాట్లాడుతూ పాత, కొత్త కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  పెండింగ్​ కేసుల సంఖ్య  తగ్గించే దిశగా పని చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి  ప్రజలకు అందుబాటులో ఉండి, సత్వర న్యాయం అందించాలన్నారు. 

 డయల్ 100 కాల్స్​కు వెంటనే స్పందించాలన్నారు.   దొంగతనాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు రాత్రి వేళల్లో పహారా కాయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు  డ్రంక్​అండ్​డ్రైవ్ టెస్టులు నిర్వహించాలన్నారు.  ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు.  దీపావళి పండుగ సజావుగా నిర్వహించుకులా చూడాలన్నారు. జూదంపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్యారెడ్డి,  ఎల్లారెడ్డి, బాన్సువాడ డీఎస్పీలు శ్రీనివాస్​రావు,  విఠల్​రెడ్డి,  సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.