పోలీసులు మెరుగైన సేవలు అందించాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

పోలీసులు మెరుగైన సేవలు అందించాలి : ఎస్పీ రాజేశ్చంద్ర
  •     ఎస్పీ రాజేశ్​చంద్ర       

కామారెడ్డిటౌన్, వెలుగు : ఈ కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి  ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ రాజేశ్​ చంద్ర పోలీస్​ అధికారులకు సూచించారు.  గురువారం కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా జిల్లా పోలీస్​ ఆఫీస్​లో  జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఐక్యత, నిబద్దత, కమిట్మెంట్​తో  విధులు నిర్వహించాలన్నారు. 

గత ఏడాది చాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గించామని, ఇతర రాష్ర్టాల గ్యాంగ్​లను పట్టుకున్నామన్నారు. వరదల విపత్తు సమయంలో అధికారులంతా సమయస్ఫూర్తి,  సమన్వయంతో  పని చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారన్నారు. జిల్లా పోలీస్​శాఖలోని ప్రతి ఒకరూ సేవా భావాన్ని చూపడం ప్రశంసనీయమన్నారు. 

నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, మహిళలు,  పిల్లల రక్షణ,  సైబర్ నేరాల నివారణ వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో శాంతిభద్రలు నెలకొల్పేందుకు పోలీస్​శాఖ నిరంతరం కృషి  చేస్తుందన్నారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి,  డీఎస్పీలు శ్రీనివాస్​రావు, విఠల్​రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్, సీఐలు, ఎస్సైలు,  ఆర్​ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.