ఢిల్లీ గగనతలంలోకి అంతరిక్ష కేంద్రం

ఢిల్లీ గగనతలంలోకి  అంతరిక్ష కేంద్రం

న్యూఢిల్లీ: భూమి నుంచి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో నిరంతరం తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్​) ఢిల్లీ ఆకాశంలో తళుక్కున మెరిసింది. మంగళవారం (జులై 08) తెల్లవారుజామున 5.42 గంటలకు ఐఎస్ఎస్​ను నగరవాసులు స్పష్టంగా చూశారు. 

కొంతమంది ఈ అరుదైన దృశ్యాలను తమ ఫోన్​​ కెమెరాల్లో బంధించారు.  సోషల్​ మీడియాలో వీటిని పోస్ట్ చేసి.. ‘హాయ్​ శుభాంశు శుక్లా’ అంటూ మెసేజ్​లు పంచుకున్నారు. కాగా, భవిష్యత్తులో కూడా భారత గగనతలం మీదుగా ఐఎస్‌‌ఎస్‌‌  ప్రయాణించనుందని సైంటిస్టులు చెబుతున్నారు. 

భూమి నుంచి సగటున 400 కి.మీ. ఎత్తులో ఐఎస్ఎస్​ చక్కర్లు కొడుతుంటుంది. ఇది ఒకసారి భూమిని చుట్టి రావడానికి దాదాపు 93 నిమిషాలు పడుతుందని చెప్పారు.