న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో స్పేస్ఎక్స్ మరో రికార్డు సృష్టించింది. ‘ఇన్స్పిరేషన్4’ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. స్పేస్ ప్రయాణంపై ఎలాంటి అనుభవంలేని నలుగురు వ్యక్తులను మూడ్రోజులు భూమి చుట్టూ తిప్పి క్షేమంగా కిందికి తీసుకొచ్చింది. స్పేస్లో పరిస్థితులపై ఆ నలుగురికి నార్మల్ ట్రైనింగ్ మాత్రమే ఇచ్చి ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది.
ఎక్కడి నుంచి స్టార్టయింది?
అమెరికాలోని నాసా ‘కెన్నెడీ’ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం రాత్రి 8.02 గంటలకు (లోకల్ టైమ్ ప్రకారం) డ్రాగన్ క్యాప్సుల్తో ఫాల్కన్ 9 రాకెట్ స్పేస్లోకి బయలుదేరింది. 585 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. అంటే స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) ఉంటున్న ఎత్తు కన్నా 165 కిలోమీటర్లు ఎక్కువ ఎత్తుకు వెళ్లింది. గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో గంటన్నరకోసారి భూమిని చుడుతూ రోజూ15 సూర్యోదయాలు, 15 సూర్యాస్తమయాలు చూసింది. నలుగురు వ్యక్తులు బిలియనీర్ జారెడ్ ఇసాక్మన్, హేలీ ఆర్సెనెక్స్ (29), సియాన్ ప్రొక్టర్ (51), క్రిస్ సెంబ్రోస్కీ (42).. మూడ్రోజులు భూ కక్ష్యలో గడిపి తిరిగి కిందికి వచ్చారు. అమెరికా టైమ్ ప్రకారం శనివారం రాత్రి 7.06 గంటలకు అట్లాంటిక్ మహాసముద్రంలో క్యాప్సుల్ ల్యాండయింది.
ఎంత ఖర్చు చేశారో?
ఇన్స్పిరేషన్4కు ఎంత ఖర్చుచేశారో బయటకు చెప్పలేదు. ఈ మిషన్ను బిలియనీర్ ఇసాక్మన్ కొన్నారు. మరో ముగ్గురు సాధారణ వ్యక్తులకు చాన్స్ఇచ్చారు. సెయింట్ జూడ్ చిల్డ్రన్ రీసెర్చ్ హాస్పిటల్ కోసం రూ.1,500 కోట్లు ఫండ్ సేకరించాలనేది ప్రయోగం ఉద్దేశం. శనివారం వరకు రూ.1,100 కోట్లు వచ్చాయి. ఇసాక్మన్ రూ. 730 కోట్లు, డొనేషన్స్ ద్వారా రూ.440 కోట్లు వచ్చాయి. మిగతా రూ.400 కోట్ల మొత్తాన్ని తాను ఇస్తానని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.మూడ్రోజులు స్పేస్లో గడిపిన నలుగురు టూరిస్టులు డ్రాగన్ క్యాప్సుల్ద్వారా భూమిపైకి తిరిగొచ్చారు. నాలుగు పారాచూచ్ల సాయంతో అట్లాంటిక్ మహా సముద్రంలో క్యాప్సుల్దిగింది. అప్పటికే చిన్న పడవల్లో వెయిట్ చేస్తున్న స్పేస్ఎక్స్ సిబ్బంది.. ఆ క్యాప్సుల్ను తాళ్లతో పెద్ద బోటుపైకి తీసుకొచ్చి క్యాప్సుల్డోర్ను ఓపెన్చేశారు. టూరిస్టులు మెల్లగా బయటకు వచ్చారు.