బాన్సువాడ అభివృద్ధి కోసమే స్పీకర్​ నయ్యా : పోచారం శ్రీనివాస్​రెడ్డి

బాన్సువాడ అభివృద్ధి కోసమే స్పీకర్​ నయ్యా : పోచారం శ్రీనివాస్​రెడ్డి

పొతంగల్ (కోటగిరి), వెలుగు: బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే స్పీకర్ పదవి తీసుకున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. శనివారం పొతంగల్ మండలంలోని సుంకినిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సారి అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచానని, సీఎం కేసీఆర్ సూచన మేరకే స్పీకర్ పదవి తీసుకున్నానన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని రూ.500 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌‌ లను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని ప్రజలు మరోమారు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మాధవరావు, ఎంపీటీసీ సా యిలు, జడ్పీటీసీ శంకర్ పటేల్, ఎంపీపీ వల్లేపల్లి సునీత, జిల్లా, మండల కోఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్,ఇస్మాయిల్, ఏసీపీ కిరణ్ కుమార్, ఆర్డీవో రాజా గౌడ్, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్ పాల్గొన్నారు.