చైనా టు ఇండియా: చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానం

చైనా టు ఇండియా: చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానం

చైనాలోని వుహాన్‌ లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేందుకు శుక్రవారం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం బయలు దేరింది. 400 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా ఈ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. కరోనా వైరస్ బారినపడ్డ వుహాన్ నగరం నుంచి డైరెక్ట్ గా ఢిల్లీకి తీసుకురానున్నామని.. చైనాలో చిక్కుకున్న భారతీయుల్లో పలువురు తెలుగువారు ఉన్నారని చెప్పారు.

గురుగాం సమీపంలోని మానేసర్ వద్ద ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. వుహాన్ నుంచి తీసుకొచ్చిన భారతీయులను వైద్య శిబిరంలో ఉంచుతామన్నారు. 14 రోజుల పర్యవేక్షణలో వైరస్ లేదని నిర్ధారణ జరిగితే బయటకు తీసుకువస్తామని తెలిపారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆర్మీ నేతృత్వంలో ఏర్పాటు చేశామని తెలిపారు.

జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ షాక్

 కివీస్ కు చుక్కలు చూపించిన భారత్

సూపర్ ఓవర్ మొదలైంది ఇలా..