మేడారానికి ప్రత్యేక బస్సులు ప్రారంభం

మేడారానికి ప్రత్యేక బస్సులు ప్రారంభం

కాశీబుగ్గ/ జనగామ అర్బన్, వెలుగు: మేడారం మహా జాతరను పురస్కరించుకొని ఆదివారం వరంగల్​ సిటీలోని వరంగల్ బస్ స్టేషన్ లోని తాత్కాలిక బస్ పాయింట్ ను, ప్రత్యేక బస్సులను హనుమకొండ ఆర్టీసీ డిపో మేనేజర్​ భూక్యా ధరంసింగ్, ఇంతేజార్​గంజ్  సీఐ ఎంఏ షుఖూర్​తో కలిసి ప్రారంభించారు.

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్​ గ్రౌండ్స్​ నుంచి మేడారం మహాజాతరకు ప్రత్యేక బస్సులను అడిషనల్​ కలెక్టర్​ బెన్​షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్​ ఆర్టీసీ డిపో మేనేజర్​ స్వాతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.