ఆగస్టు 29న చలో మైదాన్

ఆగస్టు 29న  చలో మైదాన్

హైదరాబాద్‌‌, వెలుగు:  మేజర్‌‌ ధ్యాన్‌‌చంద్‌‌ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా  పండగలా  నిర్వహించాలని స్పోర్ట్స్‌‌ అథారిటీ ఆఫ్‌‌ తెలంగాణ (శాట్స్‌‌) చైర్మన్‌‌ ఈ. ఆంజనేయగౌడ్‌‌ అధికారులకు సూచించారు. ఈ  సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన చలో మైదాన్‌‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 

ఈ  మేరకు  హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా లో క్రీడా శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ  శైలజా రామయ్యర్, 33 జిలాల డివైఎస్‌‌వోలతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. యువ లోకాన్ని క్రీడా మైదానాలకు నడిపించేందుకు చలో మైదాన్ కార్యక్రమాన్ని ఈ నెల 29న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహపూరిత వాతావరణం లో నిర్వహించాలని ఆదేశించారు.