ఆలిండియా అండర్ –19 బ్యాడ్మింటన్ టోర్నీ షురూసికింద్రాబాద్, వెలుగు : క్రీడలు మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా దేశానికి గుర్తింపు తెచ్చిపెడతా యని తెలంగాణ టూరిజం సంస్థ మాజీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్అసోసియేషన్వైస్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. బుధవారం సికింద్రాబాద్ఆర్ఆర్ సీ గ్రౌండ్లో ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండర్–19 బాయ్స్ అండ్ గర్ల్స్పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు రాష్ర్టానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు.
ఈనెల 9 వరకు జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో వివిధ రాష్ర్టాల నుంచి 900 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చండేశ్వరరావు, బ్యాడ్మింటన్క్రీడాకారుడు శ్రీకాంత్ , రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్అసోసియేషన్ ప్రతినిధులు పుల్లూరి సుధాకర్, ట్రెజరర్ బాబు, ఆనంద్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.