ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ కు 145 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ను సన్ రైజర్స్ కట్టడి చేసింది. ఓపెనర్ వార్నర్ 21, మిచెల్ మార్ష్ 25, మనీష్ పాండే 34 ,అక్షర్ పటేల్ 34 మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించ లేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 144 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ 2, వాషింగ్టన్ సుందర్ 3, నటరాజన్ కు ఒక వికెట్ పడ్డాయి.
145 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. మయాంక్ అగర్వాల్ 32, రాహుల్ త్రిపాఠి ఒక పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి సన్ రైజర్స్ 36 పరుగులు చేసింది.