సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 6 మ్యాచ్ లు ఆడి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇక ముందు ఆడాల్సిన ప్రతీ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానున్నాయి.
ఏప్రిల్ 24న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇరు జట్లు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాయి. మ్యాచ్ లో గెలవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో సన్ రైజర్స్ కెప్టెన్ అడెన్ మార్క్ రమ్ మీడియాతో మాట్లాడాడు. ఢిల్లీతో జరగబోయే మ్యాచ్ తమకు చాలా కీలకమని చెప్పాడు. రేపటి మ్యాచ్ కు స్ట్రాంగ్ గా వస్తున్నామని.. బ్యాటింగ్ లో మరింత మెరుగపడాల్సిన అవసరముందన్నాడు. అభిషేక్ పవర్ ప్లేలో బాగా ఆడగలడని.. అందుకే ఓపెనింగ్ చేస్తున్నాడని చెప్పాడు.
ఇప్పటికే పాయింట్ల పట్టికలో బాటమ్ లోఉన్నామని.. సన్ రైజర్స్ తో జరగబోయే మ్యాచ్ తమకు చాలా ముఖ్యమని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ అన్నాడు . బ్యాటింగ్ లో పార్ట్ నర్ షిప్స్ మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ఇషాంత్ శర్మ పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేయగలడని.. అందుకే లాస్ట్ మ్యాచ్ లో తీసుకున్నామని చెప్పాడు. అక్షర్ పటేల్ వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్ ..మిడిల్ ఆర్డర్ లో బాగా ఆడుతున్నాడని తెలిపాడు.