ఉప్పల్ లో జరుగుతోన్న మ్యాచ్ లో సన్ రైజర్స్ కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కోల్ కతా. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రహముల్లా, వెంకటేశ్ అయ్యార్ త్వరగానే పెవిలియన్ చేరారు. జేసన్ రాయ్ 20, నితీష్ రాణా 42, రింకూ సింగ్ 46, ఆండ్రూ రస్సెల్ 24 పరుగులతో రాణించడంతో కోల్ కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
సన్ రైజర్స్ బౌలర్లలో మెక్రో జాన్సెన్ , నటరాజన్ లకు చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, అడెన్ మార్క్రమ్, మయాంక్ మార్కెండ్ లకు ఒక్కో వికెట్ పడ్డాయి. ఇరు జట్లు ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.