దంచి కొట్టిన రాణా.. సన్ రైజర్స్ కు భారీ టార్గెట్

దంచి కొట్టిన రాణా.. సన్ రైజర్స్ కు భారీ టార్గెట్

ఐపీఎల్ 14 సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోల్ కతా నైట్ రైడర్స్ 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ నితిష్ రాణా 56 బంతుల్లో 80 పరుగులతో చెలరేగాడు. మరో ఆటగాడు రాహుల్ త్రిపాఠి 29 బంతుల్లో 53 పరుగులతో రాణించడాడు. చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ 9 బంతుల్లో 22 రన్స్ చేయడంతో కోల్ కతా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి  187 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ లకు చెరో రెండు వికెట్లు, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ కు ఒక వికెట్ పడ్డాయి.