ప్యూర్ ఎమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌ తో శ్రీ చిదంబరం

ప్యూర్ ఎమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌ తో శ్రీ చిదంబరం

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో  చింతా వినీషా రెడ్డి, చింతా గోపాల కృష్ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీచిదంబరం గారు’.  నిర్మాత వంశీ నందిపాటి ఫిబ్రవరి 6న  థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ ‘ఒక మనిషిని నువ్వు ప్రేమించగలగాలి అంటే మొదట నిన్ను నువ్వు ప్రేమించాలి అనేది ఈ కథ సారాంశం. పక్క వాళ్లతో పోల్చుకుంటూ లైఫ్‌‌‌‌‌‌‌‌ను లీడ్ చేస్తున్న  ప్రస్తుత సమాజ తీరును సున్నితమైన  భావోద్వేగాలతో  చెప్పాలనుకున్నా.  

చిదంబరం అనే పాత్రను సింగిల్‌‌‌‌‌‌‌‌ టేక్‌‌‌‌‌‌‌‌లో ప్లే చేయాలి.  కథ అనుకున్నప్పుడే వంశీని హీరోగా అనుకున్నా.  మెల్ల కన్నుతో ఈ పాత్ర చేయడం అంత ఈజీ కాదు.  దానికి చాలా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ కావాలి. మెల్లకన్ను ఉన్న వాళ్లను తూర్పు గోదావరి జిల్లాలో చిదంబరం అని ఏడిపిస్తుంటారు.  అందుకే దీనికి ఈ టైటిల్ పెట్టాం.  నేచురాలిటీ కోసం మిగతా ఆర్టిస్టులందరిని ఈస్ట్‌‌‌‌‌‌‌‌ గోదావరిలో ఆడిషన్‌‌‌‌‌‌‌‌ చేసి తీసుకున్నా.  ఇదొక  ప్యూర్‌‌‌‌‌‌‌‌ ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ జర్నీ.  

అలాగే  ఎవ్వరినీ  ఇబ్బంది పెట్టని క్లీన్‌‌‌‌‌‌‌‌ కామెడీ ఉంటుంది. కీరవాణి గారు పాడిన పాట సినిమాకు హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తుంది.   మొదట ఈ సినిమా క్రౌడ్‌‌‌‌‌‌‌‌ ఫండింగ్‌‌‌‌‌‌‌‌తో స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశాం. ఆ తరువాత నిర్మాత చింతా గోపాల కృష్టారెడ్డి గారికి  కథ నచ్చి ప్రొడ్యూస్‌‌‌‌‌‌‌‌ చేశారు.  ప్రీమియర్స్‌‌‌‌‌‌‌‌ చూసిన వారంతా కేరాఫ్ కంచరపాలెం, పెళ్లి చూపులు చిత్రాలతో పోల్చడం ఆనందంగా అనిపించింది’ అని చెప్పాడు.