యూఏఈపై శ్రీలంక ఘన విజయం

 యూఏఈపై శ్రీలంక ఘన విజయం

జీలాంగ్‌‌:  తొలి మ్యాచ్‌‌లో నమీబియా చేతిలో కంగుతిన్న శ్రీలంక టీ20 వరల్డ్‌‌ కప్‌‌ మొదటి రౌండ్​లో  పుంజుకుంది.  మంగళవారం జరిగిన గ్రూప్‌‌–ఎ రెండో మ్యాచ్‌‌లో 79 పరుగుల తేడాతో యూఏఈపై ఘన విజయం సాధించి సూపర్‌‌–12 అవకాశాలు సజీవంగా నిలుపుకుంది. తొలుత లంక 20 ఓవర్లలో 152/8 స్కోరు చేసింది. ఓపెనర్‌‌ నిశాంక (74) ఫిఫ్టీ కొట్టగా, ధనంజయ డిసిల్వ (33) రాణించాడు.  అనంతరం ఛేజింగ్‌‌లో యూఏఈ 17.1 ఓవర్లలో 73 రన్స్‌‌కే కుప్పకూలింది. జునైద్‌‌ (18) టాప్‌‌ స్కోరర్‌‌. హసరంగ (3/8), దుష్మంత చమీర (3/15), తీక్షణ (2/15) సత్తా చాటారు. నిశాంకకు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.

తొలి పోరులో లంకకు షాకిచ్చిన నమీబియా రెండో మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్​ చేతిలో  ఓడింది. తొలుత నమీబియా 20 ఓవర్లలో 121/6 స్కోరు చేసింది. జాన్​ ఫ్రైలింక్‌‌ (43) రాణించాడు. నెదర్లాండ్స్‌‌ 19.3 ఓవర్లలో 122/5 స్కోరు చేసి గెలిచి సూపర్​12కి చేరువైంది.