జీలాంగ్: తొలి మ్యాచ్లో నమీబియా చేతిలో కంగుతిన్న శ్రీలంక టీ20 వరల్డ్ కప్ మొదటి రౌండ్లో పుంజుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్–ఎ రెండో మ్యాచ్లో 79 పరుగుల తేడాతో యూఏఈపై ఘన విజయం సాధించి సూపర్–12 అవకాశాలు సజీవంగా నిలుపుకుంది. తొలుత లంక 20 ఓవర్లలో 152/8 స్కోరు చేసింది. ఓపెనర్ నిశాంక (74) ఫిఫ్టీ కొట్టగా, ధనంజయ డిసిల్వ (33) రాణించాడు. అనంతరం ఛేజింగ్లో యూఏఈ 17.1 ఓవర్లలో 73 రన్స్కే కుప్పకూలింది. జునైద్ (18) టాప్ స్కోరర్. హసరంగ (3/8), దుష్మంత చమీర (3/15), తీక్షణ (2/15) సత్తా చాటారు. నిశాంకకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
తొలి పోరులో లంకకు షాకిచ్చిన నమీబియా రెండో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. తొలుత నమీబియా 20 ఓవర్లలో 121/6 స్కోరు చేసింది. జాన్ ఫ్రైలింక్ (43) రాణించాడు. నెదర్లాండ్స్ 19.3 ఓవర్లలో 122/5 స్కోరు చేసి గెలిచి సూపర్12కి చేరువైంది.