
కొలంబో: చెన్నై నుంచి కొలంబో చేరుకున్న శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ విమానంలో పహల్గాం దాడి అనుమానితుడు ఉన్నాడన్న సమాచారంతో శ్రీలంక పోలీసులు ఆ ఫ్లైట్ను పూర్తిగా తనిఖీ చేశారు. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్కు చెందిన ఫ్లైట్ ఒకటి శనివారం చెన్నై నుంచి కొలంబోకు బయల్దేరింది.
మధ్యాహ్నం 11.59 గంటలకు కొలంబోలోని బండారునాయకె విమానాశ్రయంలో ల్యాండయింది. ఆ విమానంలో పహల్గాం ఉగ్రదాడి అనుమానితుడు ఉన్నాడని లంక పోలీసులకు సమాచారం అందింది. దీంతో విమానంలో సోదాలు చేశారు. అనుమానితులు లేకపోవడంతో ఫ్లైట్ను అనుమతించారని శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.