
హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఆదివారం శ్రీరాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రాధాగోవిందులను కొత్త వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించారు.
సాయంత్రం వేద మంత్రోచ్ఛరణలు, హరినామ సంకీర్తనల మధ్య పుష్పాభిషేకం, పల్లకీసేవ జరిపారు. హరేకృష్ణ మూవ్ మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ ప్రవచనాలు వినిపించారు. భక్తులకు నిర్వాహకులకు ప్రసాదం అందించి, అన్నదానం చేపట్టారు.