
గుర్తుందా శీతాకాలం చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు చింతపల్లి రామారావు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా దర్శకుడు వేగేశ్న సతీష్ కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియచేసిన రామారావు మాట్లాడుతూ ‘కమర్షియల్ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాం.
ఇప్పటికే షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేశాం. ఈ నెలాఖరులో ఫస్ట్ కాపీ సిద్ధం కాబోతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేస్తాం. అలాగే తెలుగులో ఓ స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నా. కన్నడ, మరాఠీలోనూ సినిమాలు నిర్మించబోతున్నా. ఏడాదికి మూడు సిని మాలు నిర్మించేలా ప్లాన్ చేసుకుంటున్నా. కమర్షియల్ వాల్యూస్తో పాటు, సమాజానికి మేలు చేసే అంశాలు ఉండేలా సినిమాలు నిర్మిస్తాను’ అని అన్నారు.