ఏపీలో పండుగపూట విషాదం.. రెండు బస్సులు ఢీ, 20 మందికి గాయాలు

ఏపీలో పండుగపూట విషాదం.. రెండు బస్సులు ఢీ, 20 మందికి గాయాలు

ఏపీలో సంక్రాంతి పండుగపూట విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ముందున్న బస్సును వెనుక నుంచి ఓ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీంతో బస్సు క్లీనర్ దినేష్ (25 ) మృతి చెందాడు. మరో 20 మంది టూరిస్టుకు గాయాలు అయ్యాయి. 

ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్ తో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ నుంచి పూరి, రామేశ్వరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అదే సమయంలో 54 మంది బస్సులో ప్రయానిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముందు బస్సులోని ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారని… కేవలం వెనుక ఉన్న ట్రావెల్స్ బస్సు ప్రయాణికులకు గాయాలు అయినట్లు పోలీసులు గుర్తించారు.