
గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థ మార్కెటింగ్విభాగం జనరల్ మేనేజర్గా గోదావరిఖని జవహర్నగర్కు చెందిన తాడబోయిన శ్రీనివాస్బాధ్యతలు చేపట్టారు. మంగళవారం హైదరాబాద్లోని హెడ్డాఫీసులో బాధ్యతలు తీసుకోగా.. పలువురు ఆఫీసర్లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణిలో సాధారణ ఓవర్మెన్గా జాబ్ లో చేరి వివిధ హోదాల్లో పదోన్నతులు పొందుతూ జీఎం స్థాయికి చేరారు.
మొన్నటి వరకు శ్రీరాంపూర్ఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో సింగరేణి బహుజన ఎంప్లాయీస్అసోసియేషన్ కన్వీనర్ బోడ భద్రు, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇ.రాజేశ్వర్, బీసీ ఎంప్లాయీస్అసోసియేషన్ ప్రెసిడెంట్సీహెచ్ప్రభాకర్, సెక్రటరీ బి.రెష్మా, ట్రెజరర్చరణ్ రాజ్, డిప్యూటీ సీఎంఓ బాలకోటయ్య, ఐటీ విభాగం డీజీఎం హరిప్రసాద్, మేనేజర్రామ లక్ష్మయ్య, లా డిపార్ట్మెంట్మేనేజర్మాధవి తదితరులు ఉన్నారు.