అక్టోబర్ 7 నుంచి శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం

అక్టోబర్ 7 నుంచి శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం

శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ.. భూ కైలాస క్షేత్రం.. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో భక్తులకు వచ్చేనెల 7వ తేదీ నుంచి స్పర్శదర్శనం కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న స్పర్శదర్శనం సామాన్యులకు అక్టోబర్ 7 నుంచి కల్పిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి లవన్న తెలిపారు. 
దసరా మహోత్సవాలు  మొదటి రోజు నుండి సామాన్య భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం కల్పిస్తామని ఈ.వో లవన్న చెప్పారు. గతంలోవలె వారంలో నాలుగు రోజుల పాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు స్వామి వార్ల స్పర్శ దర్శనం ఉంటుందని ఆయన వివరించారు. ఈ నాలుగు రోజుల్లో మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడున్నర గంటల వరకు సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తామని ఆయన వివరించారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల్లో రావాలని దేవస్థానం అధికారులు సూచించారు.