ఎర్రవల్లి చౌరస్తా, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని షేక్ పల్లి గ్రామానికి చెందిన జాలరి వినోద్ కృష్ణ వలకు 30 కిలోల బరువు ఉన్న 5 చేపలు చిక్కాయి. సోమవారం శ్రీశైలం బ్యాక్వాటర్లో చేపల వేటకు వెళ్లగా, ఏకంగా బొచ్చ రకానికి చెందిన 30 కిలోల బరువు ఉన్న చేపలు దొరకడంతో ఆనందం వ్యక్తం చేశాడు. శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గడంతో కృష్ణా నదిలో నీటి నిల్వలు తగ్గి భారీ చేపలు జాలర్లకు దొరుకుతున్నాయి.
