Srisailam : భారీగా పెరిగిన మల్లన్న హుండీ ఆదాయం.. ఎంతంటే

Srisailam :  భారీగా పెరిగిన మల్లన్న హుండీ ఆదాయం.. ఎంతంటే

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు నిర్వహించారు. 34 రోజులకు 5 కోట్ల 7 లక్షల 46 వేల 508 రూపాయలు హుండీ ద్వారా ఆదాయం  వచ్చినట్లు ఈఓ లవన్న వెల్లడించారు. ఉభయదేవాలయాల హుండి లెక్కింపు అక్కమహాదేవి అలంకార మండపంలో సీసీ కెమరాల మధ్య పకడ్బందీగా జరిగినట్లు ఆయన తెలిపారు. అయితే గడిచిన 34 రోజులలో 5 కోట్ల 07 లక్షల 46 వేల 508 రూపాయలు భక్తులు సమర్పించారని తెలిపారు. అలాగే 324 గ్రాములు బంగారం, 10 కేజీల 050 గ్రాముల వెండి , విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారని ఈవో లవన్న పేర్కొన్నారు.