శ్రీశైలంలో హుండీ లెక్కింపు.. స్వామివారికి విదేశీ కరెన్సీ

శ్రీశైలంలో హుండీ లెక్కింపు.. స్వామివారికి విదేశీ కరెన్సీ

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా  శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 2 కోట్ల 80 లక్షల 75 వేల 669 రూపాయలు నగదు రాబడిగా లభించింది. ఈ ఆదాయం  24 రోజుల్లో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు. ఈ హుండి లెక్కింపులో నగదుతోపాటు 3 ,177 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం,3 కేజీల 500 గ్రాముల వెండి  వచ్చింది.  అదే విధంగా  వివిధ దేశాల విదేశీ కరెన్సీని కూడా స్వామివారికి  భక్తులు సమర్పించారు. యుఎస్ఏ డాలర్లు 769,మలేషియా రింగిట్స్ 3, యూరోపియన్ 70, సింగపూర్ డాలర్లు 10, యూ.ఏ.ఈ దిర్హమ్స్ 25, కెనెడా డాలర్లు- 80  శ్రీశైలం మల్లన్న హుండీలో లభించాయి.పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.