ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో కొత్త సంవత్సరం సందర్భంగా రెండు రోజులు ఆర్జిత అభిషేకాలు.. స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన రెండు రోజుల పాటు భక్తుల తాకిడి ఎక్కువుగా ఉంటుందని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
నూతన సంవత్సరం తొలి రోజు సందర్భంగా ఎక్కువ మంది భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు
శ్రీశైలం దేవస్తానం ఈవో పెద్దిరాజుతెలిపారు. భక్తులు తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో.. భక్తులందరికీ త్వరితగతిన దర్శనాలు కల్పించడంలో భాగంగా స్వామివారి స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలు కూడా నిలుపుదల చేయనున్నారు. సామూహిక అభిషేకాలు, బ్రేక్ టికెట్ పొందిన భక్తులకు కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారని.. భక్తులు గమనించాల్సిందిగా ఆలయ అధికారులు తెలియజేశారు.
అర్జిత హోమాలు, అమ్మవారి కుంకుమార్చనలు యధావిధిగా ఉంటాయి. అర్జిత హోమాలు, కుంకుమార్చన టికెట్లు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచామని ఈఓ పెద్దిరాజు తెలిపారు.