న్యూఢిల్లీ: స్టార్ షూటర్ మను భాకర్.. ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్ (ఓఎస్టీ)లో అదరగొట్టింది. ట్రయల్స్–1లో భాగంగా శనివారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ఆమె 50 పాయింట్లకుగాను 47 సాధించి విన్నర్గా నిలిచింది. దీంతో యాంగ్ జిన్ (కొరియా ,41) పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. ఏడో రౌండ్ తర్వాత 23 పాయింట్లకే పరిమితమైన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ ముందుగానే ఎలిమినేట్ అయ్యింది.
రిథమ్ సాంగ్వాన్, అభింద్య 25 పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్లో నిలిచారు. సెలెక్షన్ ప్రాసెస్ ప్రకారం ఫైనల్ గెలిచినందుకు భాకర్ స్కోరుకు 0.60 పాయింట్లు జత చేస్తారు. మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ ఫైనల్లో అనీష్ భన్వాలా 33–27తో విజయ్వీర్ పై నెగ్గాడు. ఆదర్ష్ సింగ్ (23) మూడో ప్లేస్ సాధించాడు.