
పిట్లం, వెలుగు: వైశాఖ మాస హనుమాన్ జయంతి సందర్భంగా పిట్లం పోతిరెడ్డిపల్లి హనుమాన్ ఆలయం నుంచి సారంగపూర్ మహారుద్ర వీర హనుమాన్ ఆలయానికి పాదయాత్ర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం పాదయాత్రను ఆలయ నిర్వాహకులు తేజ గురుస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైశాఖ మాస హనుమాన్ జయంతి కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం మహశివునికి రుద్రాభిషేకం, అన్నపూజ ఉంటుందని తెలిపారు. సాయంత్రం ఆలయ ఆవరణలో కుస్తీ పోటీలు ఉంటాయని తెలిపారు.