
ముంబై: ఎన్నికలు ఉండటం, రాబడి తగ్గుదల కారణంగా అనేక రాష్ట్రాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ మూలధన వ్యయ లక్ష్యాలను (క్యాపెక్స్ టార్గెట్స్) చేరుకోవడం కష్టమని ఒక రిపోర్ట్ తెలిపింది. ఆదాయ వసూళ్లు బాగా తగ్గడం వల్ల క్యాపెక్స్లో భారీ కుదుపు ఏర్పడుతుందని, 2024 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో ఇది రికార్డు స్థాయిలో 35 శాతానికి పెరిగిందని ఇక్రా రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు. మనదేశంలో 21 రాష్ట్రాలు బడ్జెట్అంచనాలను కొనసాగించడానికి 28 శాతం క్యాపెక్స్ రన్రేట్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్నెళ్లలో కొనసాగించాలి. ఇది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
వీటి ఆర్థిక లోటు ఏప్రిల్–-సెప్టెంబర్ కాలంలో వరుసగా రూ. 50వేల కోట్లు, రూ. 2.4 లక్షల కోట్ల నుంచి వరుసగా రూ.70వేల కోట్లు, రూ. 3.5 లక్షల కోట్లకు పెరిగింది. ఈ రిపోర్టు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్లను మినహాయించింది. ఈ 21 రాష్ట్రాల ఉమ్మడి రాబడి రాబడులు, ఖర్చుల పెరుగుదల బడ్జెట్ అంచనాల కంటే వెనుకబడి ఉండగా, వాటి మూలధన వ్యయాలు, నికర అప్పులు ఎక్కువగా ఉన్నాయి.