మోదీకి బిగ్ షాక్.. వాట్సాప్ లో వికసిత్ భారత్ ప్రచారానికి బ్రేక్

మోదీకి బిగ్ షాక్.. వాట్సాప్ లో వికసిత్ భారత్ ప్రచారానికి బ్రేక్

బీజేపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న మోదీ వికసిత్ భారత్ ప్రచారాన్ని నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత... కేంద్ర ప్రభుత్వం స్వయంగా వికసిత్ భారత్ ప్రచారం చేస్తుందని.. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా ఈ ప్రచారం తీవ్రంగా ఉందని.. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని.. వెంటనే వాట్సాప్ ప్రచారాన్ని బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎలక్షన్ కమిషన్.

వాట్సాప్ ద్వారా బీజేపీ ప్రభుత్వం.. వికసిత్ భారత్ పేరుతో మెసేజులు పంపిస్తుంది.. వికసిత్ భారత్ గ్రూప్ ను అన్ని ఫోన్లకు పంపిస్తుంది. వారం రోజులుగా దేశంలోని ప్రతి ఒక్కరి ఫోన్ లోని వాట్సాప్ కు ఈ మెసేజ్ వస్తుంది. వికసిత్ భారత్ పేరుతో మనకు తెలియకుండానే.. మన వాట్సాప్ లోకి వస్తున్న విషయం అందరికీ తెలిసింది. వికసిత్ భారత్ వాట్సాప్ ప్రచారంలో పలు పార్టీలు ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేశాయి. విచారణలో వాస్తవం అని తేలటంతో.. 2024, మార్చి 21వ తేదీ ఈ మేరకు ఎన్నికల సంఘం.. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.