బ్రిటిష్ బైకుల తయారీ కంపెనీ ట్రయంప్ మోటర్ సైకిల్స్ తమ మిడ్ వెయిట్ సెగ్మెంట్ బైక్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైక్ ధర రూ. 8.84 లక్షలు(ఎక్స్ షోరూమ్ ). స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఎస్ మోడల్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఈ బైక్ తీసుకొచ్చామని ట్రయంప్ ఇండియా పేర్కొంది. స్ట్రీట్ ఆర్ ఎస్ (రూ. 11.33 లక్షలు) ధర కంటే స్ట్రీట్ ఆర్ ధర అఫర్డబుల్గా ఉంది. ఈ రెండు వెహికల్లలోనూ ట్రయంప్ మోటో2 ఇంజిన్లను అమర్చారు.