కుమ్రం భీం జిల్లా : అంధుల కోసం కొత్త పరికరాన్ని తయారు చేశారు కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ లోని నవోదయ విద్యార్ధులు. పదో తరగతి చదువుతున్న తేజరాణి, రవికిరణ్ కలిసి.. బ్లైండ్ ఐ పేరుతో అంధులకు ఉపయోగపడేలా ఓ పరికరాన్ని తయారు చేశారు. మూడు సెన్సార్ పరికరాలను ఉపయోగించి నావిగేషన్ సాయంతో… సెల్ ఫొన్ కి లింకేజ్ చేశారు.
దీన్ని అంధులు కళ్లకు పెట్టుకుంటే.. ఎదురుగా ఉన్న వస్తువులు, మనుషులను గుర్తించి… హెడ్ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. శాటిలైట్ మ్యాప్ ద్వారా వెళ్లే దారి కూడా తెలుస్తుందన్నారు. రోడ్డుపై ఉన్న బోర్డులపై ఉన్న పేర్లను కూడా ఈ పరికరం చెబుతుందంటున్నారు.