
- గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్కు రూ.10 వేలు డిమాండ్
గంగాధర, వెలుగు : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన ఒకరి భూమిని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు గంగాధర ఇన్ చార్జి సబ్రిజిస్ట్రార్లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేటకు చెందిన కొక్కుల రాజేశానికి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి సర్వే నంబర్ 131లో 486.42 చదరపు గజాల భూమి ఉంది. రాజేశం ఈ భూమిని తన కొడుకు అజయ్కుమార్కు గిఫ్ట్ డీడ్ చేయించాలనుకున్నాడు.
గంగాధరకు చెందిన తన ఫ్రెండ్, డాక్యుమెంట్ రైటర్ ఆకుల అంజయ్యతో కలిసి రెండు రోజుల కింద గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చి ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ శివారం సురేశ్బాబును కలిశారు. రూ.10 వేలు లంచం ఇస్తేనే పనవుతుందని సురేశ్బాబు స్పష్టం చేశాడు. దీంతో అంజయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్, ఆఫీస్ సబార్డినేట్ కొత్తకొండ శ్రీధర్కు డబ్బులు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ సూచించడంతో శనివారం రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ పట్టుకుంది. సురేశ్బాబు, శ్రీధర్పై కేసు నమోదు చేశామని, ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో ఉన్న సురేశ్బాబు ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.12.3 లక్షల నగదు , 350 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.