మాలమహానాడు ఆఫ్ ఇండియా స్టేట్​ ప్రెసిడెంట్​గా సుధీర్​

మాలమహానాడు ఆఫ్ ఇండియా స్టేట్​ ప్రెసిడెంట్​గా సుధీర్​
  •     నేషనల్​ సెక్రటరీగా కాసర్ల యాదగిరికి బాధ్యతలు

కోల్​బెల్ట్, వెలుగు : మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన జూపాక సుధీర్​ను నియమిస్తూ ఆ సంఘం నేషనల్ ​ప్రెసిడెంట్​పసుల రామ్మూర్తి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ కార్యదర్శిగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాసర్ల యాదగిరి, నేషనల్​ వైస్​ ప్రెసిడెంట్​గా ముత్తమాల పుల్లయ్య, స్టేట్ వైస్​ ప్రెసిడెంట్​గా సోగాల కిష్టయ్య, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఎరుకల శ్రీనివాస్​ను నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.

ఈ సందర్భంగా సుధీర్, యాదగిరి మాట్లాడుతూ.. దళితుల ఐక్యత, అంబేద్కర్ ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. తమ ఎంపికకు కృషిచేసిన నేషనల్​ ప్రెసిడెంట్, మాలమహానాడు శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.