యాసంగికి సరపడా యూరియా : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

యాసంగికి సరపడా యూరియా : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
  •     కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి

నిజామాబాద్,  వెలుగు : యాసంగి సీజన్​కు సరిపడా 32 వేల టన్నుల యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం డిచ్​పల్లి మండలంలోని సుద్దులం సింగిల్ విండో గోదామ్​లోని యూరియా స్టాక్​ను పరిశీలించి మాట్లాడారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేసి సమస్య సృష్టించొద్దన్నారు. 

నానో యూరియాపై రైతుల్లో ఉన్న అపోహలు తొలగిపోయేలా అగ్రికల్చర్ ఆఫీసర్లు అవగాహన కల్పించాలన్నారు. నానో ప్రయోజనాలు, డ్రోన్​ల వినియోగం లాభాలను వివరించారు. కలెక్టర్​ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, తహసీల్దార్ సతీష్​ తదితరులు ఉన్నారు.