తగ్గిన ఉత్పత్తి.. చుక్కల్లో చక్కెర ధరలు

తగ్గిన ఉత్పత్తి.. చుక్కల్లో చక్కెర ధరలు
  • ఈ ఏడాది తగ్గిన ఉత్పత్తి

న్యూఢిల్లీ:నిన్నమొన్నటి దాకా టమాటా ధరలతో సతమతమైన జనానికి ఇప్పుడు చక్కెర సెగ తగులుతోంది. దేశవ్యాప్తంగా వీటి ధరలు గత 15 రోజుల్లో 3 శాతం కంటే ఎక్కువ పెరిగి ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని వ్యాపారులు తెలిపారు. దేశంలోని కీలక ప్రాంతాల్లో పరిమిత వర్షపాతం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఫలితంగా రాబోయే సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తి తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చక్కెర ధరల మంట  వల్ల ఫుడ్​ ఇన్​ఫ్లేషన్​అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరింత విషమిస్తే చక్కెర ఎగుమతులను కేంద్రం నిషేధించే పరిస్థితి రావొచ్చని భావిస్తున్నారు. 

గ్లోబల్​ మార్కెట్లలోనూ వీటి ధరలు పదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.  కరువు కారణంగా కొత్త సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తి బాగా పడిపోతుందని చక్కెర మిల్లులు ఆందోళన చెందుతున్నాయని, తక్కువ ధరకు విక్రయించడానికి  ఇష్టపడటం లేదని బొంబాయి షుగర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జైన్ అన్నారు. అయితే అధిక ధరల వల్ల బలరాంపూర్ చీని, ద్వారకేశ్​ షుగర్, శ్రీ రేణుకా షుగర్స్,  దాల్మియా భారత్ షుగర్ వంటి ఉత్పత్తిదారులకు లాభాలు పెరుగుతాయని, రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించగలుగుతాయని డీలర్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఉత్పత్తి 3.3 శాతం తగ్గి 31.7 మిలియన్ మెట్రిక్ టన్నులకు పడిపోతుందని అంచనా.  

వానలు రాకే ఇబ్బందులు

మహారాష్ట్ర,  కర్ణాటకలో చెరకు దిగుబడిని తక్కువ వర్షపాతం దెబ్బతీసింది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే స్టాక్​ మొత్తం దేశ ఉత్పత్తిలో సగానికి పైగా ఉంది.  చక్కెర ధరలు మంగళవారం  మెట్రిక్ టన్నుకు 37,760 రూపాయలకు (454.80 డాలర్లు) పెరిగాయి. 2017 అక్టోబర్  తర్వాత ధరలు ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. అయితే మన ధరలు గ్లోబల్ వైట్ షుగర్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ కంటే దాదాపు 38శాతం తక్కువగా ఉన్నాయి. ధరల పెరుగుదల కొత్త సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎగుమతులను అనుమతించకుండా భారత ప్రభుత్వాన్ని ఆపవచ్చని జైన్ అన్నారు. 

గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో 11.1 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెరను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ప్రస్తుత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6.1 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెరను మాత్రమే ఎగుమతి చేయడానికి  మిల్లులను అనుమతించింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమయ్యే సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చక్కెర ఎగుమతి చేయకుండా మిల్లులను ప్రభుత్వం  నిషేధిస్తుందని, ఏడేళ్లలో మొదటిసారిగా ఎగుమతులను నిలిపివేస్తుందని ప్రభుత్వ వర్గాలు గత నెలలో తెలిపాయి. రానున్న నెలల్లో చక్కెర ధరలు మరింత పెరగవచ్చని, స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పడిపోవడం వల్ల పండుగల సీజన్​లో ఇబ్బందులు ఏర్పడవచ్చని ముంబైకి చెందిన ఓ వ్యాపారి తెలిపారు.