చెరుకు రైతులకు సబ్సిడీపై డ్రోన్

చెరుకు రైతులకు సబ్సిడీపై డ్రోన్

సదాశివనగర్, వెలుగు: చెరుకు రైతులకు రూ.లక్ష సబ్సిడీపై డ్రోన్లు అందిస్తున్నామని, తెలంగాణతోపాటు మహారాష్ర్ట, కేరాళ, ఛత్తీస్​గడ్ రాష్ర్టాల రైతులకు భారత ప్రభుత్వ (డీజీసీఏ) ద్వారా ఆమోదించి డ్రోన్లు గాయత్రీ షుగర్స్​యాజమాన్యం ఆధ్వర్యంలో తయారు చేస్తుందని ప్రెసిడెంట్ శంకర్​రావు, వైస్​ప్రెసిడెంట్​వేణుగోపాల్​రావు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండలంలోని అడ్లూర్, ​ఎల్లారెడ్డి గాయత్రీ షుగర్స్​ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతుల వ్యవసాయ పంటల వద్ద డ్రోన్​ ద్వారా పురుగు మందుల పిచికారీ విధానాన్ని ప్రారంభించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకే గాయత్రీ యాజమాన్యం సీఈవో అనురుధ్​​రెడ్డి ఆధ్వర్యంలో డ్రోన్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ అవసరం ఉన్న రైతులకు బ్యాంక్​ ద్వారా రుణాలు తీసుకుని కొనుగోలు చేయవచ్చాన్నారు. వ్యవసాయ పనుల్లో రైతులు డ్రోన్లు వాడి అధిక దిగుబడి పొందాలని సూచించారు. కార్యక్రమంలో డ్రోన్​మార్కెటింగ్​ అధికారి రాజేంద్రప్రసాద్, పైనాన్స్​ మేనేజర్​ మాల కొండయ్య, పీవో బస్వాపున్నరెడ్డి, మేనేజర్ కేన్​ సిద్ధగౌడ్, బాల్​రాజ్, దామోదర్​రెడ్డి, శ్రీనివాస్​రావు, ఏవోలు రమేశ్, లక్ష్మారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.