
‘విరూపాక్ష’ సినిమాతో సంయుక్త మీనన్ పేరు ట్రెండింగ్గా మారింది. కార్తిక్ దండు దర్శకత్వంలో సాయ్ ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్టందుకున్న విషయం తెలిసిందే. సంయుక్త లేని ఈ మిస్టరీ థ్రిల్లర్ను ప్రేక్షకులు ఊహించుకోలేరు. అంతలా తన రోల్కు ఇంపార్టెన్స్ దక్కింది. తాజాగా ఈ సినిమా దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పి షాకిచ్చాడు.
ఇందులో అసలు విలన్గా యాంకర్ శ్యామల రోల్ను చూపించాలనుకున్నారట. అయితే, ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన తన గురువు సుకుమార్ సూచన మేరకు అందులో మార్పులు చేశాడట. దీంతో హీరోయిన్నే అసలు విలన్గా చూపిస్తూ కథను మార్చుకున్నారట. సినిమాకు ఈ సస్పెన్స్ ఎంత పెద్ద ప్లస్గా మారిందో తెలిసిందే. సుకుమార్ ఈ చేంజ్ చేసుండకపోతే ఈ ముద్దగుమ్మకు ఇంత క్రేజ్ వచ్చేది కాదేమో.