ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ బరిలో ఛెత్రి

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ బరిలో ఛెత్రి

న్యూఢిల్లీ : ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌ ఛెత్రి ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగనున్నాడు. చైనాలోని హాంగ్జౌ వేదికగా ఈనెల 23న మొదలయ్యే గేమ్స్‌‌‌‌‌‌‌‌ కోసం 17 మందితో కూడిన ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను ఆలిండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ (ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌) బుధవారం ప్రకటించింది. కుర్రాళ్లతో కూడిన ఈ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఛెత్రి మాత్రమే పేరున్న ప్లేయర్‌‌‌‌‌‌‌‌.

ALSO READ: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఇంకా జీతం పడలే

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ ముందుగా 22 మందితో ప్రాధమిక టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసింది. కానీ, ఈ నెల 21వ తేదీ నుంచి ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో పలువురు టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ జట్లు ఒప్పుకోలేదు. మరోవైపు నేషనల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ ఇగోర్‌‌‌‌‌‌‌‌ స్టిమాచ్‌‌‌‌‌‌‌‌ ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండే విషయంపై స్పష్టత లేదు.