
బాల్కొండ, వెలుగు: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి సోమవారం హైదరాబాద్లో క్యాంప్ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో సమస్యలను వివరించారు. పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ చేయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.