హైదరాబాద్​ ఫ్యాన్స్​కు ఫుల్​ కిక్

హైదరాబాద్​ ఫ్యాన్స్​కు ఫుల్​ కిక్

వెలు​గు, హైదరాబాద్:సొంతగడ్డపై సన్​రైజర్స్ హైదరాబాద్ మరోసారి అభిమానులను అలరించింది. ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా బుధవారం లక్నోతో జరిగిన మ్యాచ్​లో అద్భుత విజయం సాధించి.. ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది.  లక్నో బ్యాటర్ల మెరుపులు లేకపోయినా.. సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్యాసాలను ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్వాదించారు. ఆపై హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అభిషేక్ శర్మ ఫోర్లు, సిక్సర్ల మోత మోగించడంతో 35 వేల పైచిలుకు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోబీఎన్ రెడ్డి నగర్ - సేఫ్ చారిటబుల్ ఫౌండేషన్, ఎల్బీ నగర్ - అనాథ విద్యార్థి గృహానికి చెందిన 30 మంది చిన్నారులను ఆయన కుమార్తె నైమిషా స్టేడియానికి తీసుకొచ్చి   మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసే అవకాశం కల్పించారు.