‘వైశాలి’ లాంటి సూపర్ హిట్ తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో ‘శబ్దం’ అనే సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ వస్తోంది. 7G ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. గురువారం హీరో ఆది పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
హీరో నాని ఈ పోస్టర్ను లాంచ్ చేశాడు. ఇందులో ఆది కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేస్తుండగా.. చుట్టూ గబ్బిలాలు ఎగురుతుండటం ఆసక్తికరంగా ఉంది. సినిమాలోని చాలా సీన్స్ను పర్వతాలు, టూరిస్ట్ ప్లేస్లలో తీశామని, అలాగే కేవలం ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం రెండు కోట్ల రూపాయలతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్ను నిర్మించామని మేకర్స్ చెప్పారు.
అలాగే తమన్ సినిమా కోసం ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లబోతున్నాడట. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.