చేనేత వస్త్రాలను ఆదరించండి: ఎల్.రమణ

చేనేత వస్త్రాలను ఆదరించండి: ఎల్.రమణ

బషీర్​బాగ్, వెలుగు: చేనేత వస్త్రాలను ఆదరించి చేనేత కార్మికులను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ పిలుపునిచ్చారు. వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ , తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నారాయణగూడ పద్మశాలి భవన్ లో ఏర్పాటుచేసిన హ్యాండ్లూమ్ ఎక్స్​పోను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, కార్యదర్శి గడ్డం జగన్నాథం, రాష్ట్ర అధ్యక్షుడు కమర్థపు మురళి, మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ పాల్గొన్నారు.