గుడిలో మహిళల భద్రతకు ఆదేశాలివ్వలేం

గుడిలో మహిళల భద్రతకు ఆదేశాలివ్వలేం

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన ఆర్డర్స్ పై స్టే ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఆలయంలోకి వెళ్లేందుకు తమకు భద్రత కల్పించాలంటూ.. ఇద్దరు మహిళా ఉద్యమకారులు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు విన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. ఆలయ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి రెఫర్ చేశామని ఇప్పుడు తాము ఏ నిర్ణయం తీసుకోలేమని కోర్టు చెప్పింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం మహిళలకు అనుకూలంగా తీర్పు చెబితే.. తాము భద్రత కల్పిస్తామని కోర్టు కామెంట్ చేసింది.