
వక్ఫ్సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 లోని కొన్ని నిబంధనలను సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన CJI BR గవాయ్ ,న్యాయమూర్తి అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం సోమవారం(సెప్టెంబర్15) మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం సవరణను నిలిపివేయాలని కేసు వేయలేదు.. సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలను నిలిపివేసినట్లు కోర్టు తెలిపింది.
వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. పూర్తి స్థాయి వక్ఫ్ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించింది. వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. ఆస్తులు వక్ఫ్ బోర్డువా కాదా అనేది కోర్టులు తేలుస్తాయి..వివాదాస్పద ఆస్తులపై థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వక్ఫ్బోర్టులో ముగ్గురికి మించి ముస్లిమేతరులు ఉండకూడదని తీర్పునిచ్చింది.
వక్ఫ్సవరణ చట్టంలోని మూడు కీలక అంశాలపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు.
- 5 సంవత్సరాలు ముస్లింలు ఉండాలనే నిబంధన
- వక్ఫ్ భూములపై కలెక్టర్ నిర్ణయం తీసుకోవద్దు
- వక్ఫ్ సంస్థలలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ముస్లిమేతరులను ఉండొద్దు
ఇది తుది తీర్చు కాదు.. కోర్టు పరిశీలన మాత్రమే..చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ పార్టీలు తదుపరి వాదనలు వినిపించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.