న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 10న తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసింది. ‘‘కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం.
ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పైనా అదేరోజు వాదనలు వింటాం” అని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నా రు. కాగా, మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.