మిరప పంటకు నీళ్లు వదులుతారా? లేదా?

మిరప పంటకు నీళ్లు వదులుతారా? లేదా?

పెబ్బేరు, వెలుగు: మండలంలోని వివిధ గ్రామాల్లో వేసిన మిరప పంటకు నీళ్లు వదులుతారా? లేదా? అని సర్పంచులు నిలదీశారు. శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్​లో మండల సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్​ శాఖ అధికారులు మీటింగ్ కు​హాజరు కాకపోవడంతో సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అధికారులు రానప్పుడు సమావేశాలు ఎందుకని ఫైర్​ అయ్యారు. మిరప పంటను కాపాడేందుకు ఫిబ్రవరి 15 వరకు డీ–19 కాలువకు నీటిని విడుదల చేయాలని కోరారు. జడ్పీ చైర్మన్​ లోక్​నాథ్​రెడ్డి ఇరిగేషన్​ ఎస్ఈ సత్య శీలారెడ్డితో ఫోన్​లో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. 

డబుల్​ బెడ్రూం ఇండ్లను నిరు పేదలకు కాకుండా ప్రభత్వ ఉద్యోగులకు, రెండేసి ఇండ్ల ఉన్న వారికి మంజూరు చేశారని ఆరోపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని గుమ్మడం సర్పంచ్​ సువర్ణ హెచ్చరించారు. ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ పద్మ, తహసీల్దార్​ లక్ష్మి, ఎంపీడీవో  ప్రవీణ్​కుమార్​ పాల్గొన్నారు.