
హైదరాబాద్, వెలుగు: లైటింగ్, స్టీల్, ఐరన్ ప్రొడక్టులు తయారు చేసే సూర్య రోష్ని రాబోయే పండుగ సీజన్ కోసం హోం అప్లియెన్సెస్ను లాంచ్ చేసింది. కొత్త ఆఫరింగ్స్ లో ఎల్ఈడీ బల్బులు, రైస్ కుక్కర్ (ఇండికూక్), జ్యూసర్ మిక్సర్ గ్రైండర్స్ (ఆస్పైర్, గెలాక్సీ-ఐ), హెవీ వెయిట్ డ్రై ఐరన్స్ (శక్తి ప్లస్, బోల్ట్), ఇన్ఫ్రారెడ్ ఇండక్షన్ కుక్టాప్స్, స్టోరేజ్ ఇన్స్టంట్ వాటర్ హీటర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ - జితేంద్ర అగర్వాల్ మాట్లాడుతూ ‘‘మాది ఇండియాలోనే అతిపెద్ద లైటింగ్ కంపెనీ. ఏపీలోని హిందూపూర్ సహా దేశంలో ఆరు ఫ్యాక్టరీలు ఉన్నాయి.
గత ఏడాది రూ.7,900 కోట్లకుపైగా టర్నోవర్ సాధించాం. ఈసారి రెండంకెల గ్రోత్ను ఆశిస్తున్నాం. దాదాపు నాలుగు వేల దుకాణాల్లో మా ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో మాకు 18 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశంలోని టాప్–3 కన్జూమర్ లైటింగ్ కంపెనీల్లో మాది మూడోస్థానం. మా ప్రొడక్టులను 51 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మేం పీఎల్ఐ స్కీముకూ ఎంపికయ్యాం”అని చెప్పారు.